: ధోనీ నుంచి నేర్చుకున్నా... టీమిండియాపై ప్రణాళికలున్నాయి: జాసన్ హోల్డర్

భారత జట్టును కూల్చే ప్రణాళికలు ఉన్నాయని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ అన్నారు. భారత్-విండీస్ మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ధోనీ నుంచి తాను చాలా నేర్చుకున్నానని అన్నాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ధోనీ సారధ్యంలో ఆడానని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో ఓ జట్టు నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ధోనీ నుంచి నేర్చుకున్నానని అన్నాడు. ధోనీ బాధ్యతాయుతమైన కెప్టెన్ అని హోల్డర్ పేర్కొన్నాడు. రేపటి మ్యాచ్ లో బలమైన భారత బ్యాటింగ్ లైనప్ ను కూల్చే ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశాడు.

More Telugu News