: తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టొద్దు... ప్రత్యేక హోదా కోసం ఎంపీలంతా పోరాడాలి: పవన్

తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టొద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంత రైతులతో భేటీ అయ్యేందుకు నేటి ఉదయం గుంటూరు జిల్లా వెళ్లిన పవన్ కల్యాణ్, కొద్దిసేపటి క్రితం తుళ్లూరులో రైతులు, రాజకీయ పార్టీలను ఉద్దేశించి ఆవేశంగా ప్రసంగించారు. తెలుగు జాతి ఆత్మ గౌవరాన్ని తాకట్టు పెట్టకుండా రాజకీయ పార్టీల నేతలు వ్యవహరించాలని ఆయన సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంపీలంతా పార్టీలకతీతంగా పోరు సాగించాలని ఆయన పిలుపునిచ్చారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని ప్రయోజనాలను కేంద్రంతో కొట్లాడి సాధించుకోవాలని ఆయన సూచించారు.

More Telugu News