: మీ బాధ నాకు తెలుసు... నేనున్నా!: పవన్

జనసేన అధ్యక్షుడి రాజధాని పర్యటన అభిమానుల కోలాహలం మధ్య ప్రారంభమైంది. ఉండవల్లిలో ఆయన పర్యటన మొదలుకాగా, సభా వేదిక వద్ద తీవ్ర తోపులాట జరిగింది. పవన్ ను దగ్గర నుంచి చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు, సభ నిర్వాహకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పవన్ స్వయంగా రంగంలోకి దిగారు. అభిమానులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల బాధ తనకు తెలుసునని, సమస్యలు తీర్చేందుకు తాను ముందుంటానని వివరించారు. ప్రస్తుతం ఆయన రైతులను ఒక్కొక్కరిగా వేదికపైకి ఆహ్వానించి వారితో మాట్లాడుతున్నారు.

More Telugu News