: నరమాంస భక్షకులు భారత్ లో ఉన్నారు!

నరమాంస భక్షకులు మన దేశంలో అదీ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన వారణాసిలో ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. జడలు, జడలుగా జుట్టూ, గెడ్డం పెంచి, దేహమంతా విభూతి పూసుకొని సంచార జీవితం గడిపే ‘అఘోరి’ తెగకు చెందిన సాధువులు నరమాంస భక్షకులని ఇటలీ ఫోటోగ్రాఫర్ ఓస్టినెల్లీ తెలిపారు. వారి జీవన విధానం అధ్యయనం చేసేందుకు ఆయన వారి మధ్య కొంత కాలం గడిపారు. వారి ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. కాగా, వారు బతికున్న మనుషులను పీక్కుతినరు. చనిపోయిన వారి మాంసాన్ని మాత్రమే ఆరగిస్తారట. మానవ కపాలాల్లో ద్రవ పదార్థాలు పోసుకొని తాగుతారట. పగలంతా వారణాసి పట్టణంలో తిరుగుతూ, ధ్యానం చేసుకుంటూ కనిపించే వారు, రాత్రుళ్లు శ్మశానాల్లో భోంచేసి అక్కడే పడుకుంటారట. కాలీకాలని మృతదేహాలను, ఖననం చేయకుండా నదిలో పడేసిన మృతదేహాల నుంచి మాంసాన్ని వీరు తీసుకుంటారట. మానవ దేహాన్ని తుచ్ఛమైనదీ, నీచమైనదని భావించే వీరు స్వర్గలోక ప్రాప్తి కోసం కాళికాదేవిని, శివనామాన్ని స్మరిస్తారు. ఆ దేవతలు రాత్రిపూట శ్మశానాల్లో సంచరిస్తారనే నమ్మకంతోనే వారు శ్మశానాల్లో నిద్రిస్తారు. వీరి మూలాలు 17వ శతాబ్దంలో ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. బాబా కినారమ్‌ ను వీరు గురువుగా భావిస్తారు. ఆయన 170 సంవత్సరాలు బతికినట్టు చెబుతారట.

More Telugu News