: హోటల్ పై దాడి ఐఎస్ఐఎస్ పనే!

లిబియా రాజధాని ట్రిపోలిలో కొరింథియా హోటల్ పై దాడి చేసింది తామేనని ఐఎస్ఐఎస్ ప్రకటించుకుంది. ఈ మేరకు తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ దాడిలో ముగ్గురు భద్రత సిబ్బంది, ఐదుగురు విదేశీయులను బలిగొన్న మిలిటెంట్లు, 15 మందిని బందీలుగా పట్టుకున్నారు. ముసుగులు ధరించిన సాయుధులు తొలుత కారుబాంబును పేల్చి, ఆ తర్వాత కాల్పులకు దిగినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. ప్రస్తుతం ఈ హోటల్ ను పోలీసులు చుట్టుముట్టారు.

More Telugu News