: అణు ఒప్పందంపై నాటి మీ వైఖరి ఏమైంది?: మోదీ సర్కారుపై డిగ్గీ రాజా ఫైర్

అమెరికాతో భారత అణు ఒప్పందానికి సంబంధించి మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ విమర్శలు ఎక్కుపెట్టారు. నాడు యూపీఏ ప్రతిపాదించిన బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ నేతలు, నేడు అవే అంశాలతో కూడిన ఒప్పందానికి మొగ్గుచూపారని ఆయన అన్నారు. ఈ విషయంలో మోదీ సర్కారు యూటర్న్ తీసుకుందని డిగ్గీరాజా ధ్వజమెత్తారు. ఆనాడు వారి అభ్యంతరాల నేపథ్యంలో బిల్లుకు మార్పులు చేసినా బీజేపీ శాంతించలేదని... నేడు మాత్రం అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందంలో అవే అంశాలతో ముందుకెళ్లడంపై వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

More Telugu News