: ఒబామాకు సెల్యూట్ చేసింది రష్యన్ తయారీ ట్యాంకులు!

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత గణతంత్ర దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన భారత్ అమ్ములపొదిలో ఉన్న ఆయుధ సంపత్తిని చూసి అబ్బురపడ్డారు. కాగా, ఒబామా ప్రధాని మోదీతో కలిసి పెరేడ్ ను వీక్షిస్తుండగా రంగంలోకి భీష్మ టి-90ఎస్ ట్యాంకులు వచ్చాయి. నిదానంగా తరలివెళుతూ తమ గొట్టాలను ఒబామా, మోదీ తదితరులున్న వేదికవైపు తిప్పి సెల్యూట్ చేశాయి. ఆ ట్యాంకులు రష్యాలో తయారైనవి. అవే కాదు, ప్రదర్శనలో ఆకర్షణగా నిలిచిన ఎంఐ-17వి5 హెలికాప్టర్లు కూడా రష్యా ఉత్పాదనలే. అందరి చూపును తమవైపు తిప్పుకున్న బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్ కూడా రష్యా భాగస్వామ్యంతో తయారైనద!

More Telugu News