: సెల్ఫీ మోజు... ముగ్గురు కాలేజీ కుర్రాళ్ల ప్రాణాలు తీసింది!

సెల్పీల మోజు నానాటికీ పెరిగిపోతోంది. సరదా కోసం సెల్ఫీలు తీసుకుంటున్న క్రమంలో ఇప్పటికే పలు ప్రమాదాలు చోటుచేసుకోగా, తాజాగా అదే సెల్ఫీ మోజు సోమవారం ముగ్గురు కాలేజీ కుర్రాళ్ల ప్రాణాలను బలిగొంది. రైలు ముందు సెల్ఫీ తీసుకోవాలని యత్నించిన సదరు కుర్రాళ్లను వేగంగా దూసుకొచ్చిన రైలు ఢీకొట్టింది. ఢిల్లీ, మొరాదాబాద్, ఫరీదాబాద్ లకు చెందిన నలుగురు యువకులు యాకూబ్, ఇక్బాల్, అఫ్ఝల్, అనీష్ లు రిపబ్లిక్ డే సందర్భంగా తాజ్ మహల్ సందర్శన కోసం కారులో ఆగ్రా బయలుదేరారు. రైల్వే ట్రాక్ చూడగానే, రైలు ముందు సెల్ఫీ తీసుకోవాలనే ఉత్సుకతతో కారును ఆపేశారు. వెంటనే రైల్వే ట్రాక్ పైకి వెళ్లిన వారు అటుగా వస్తున్న రైలు ముందు నిలిచి సెల్ఫీ తీసుకోవాలని యత్నించారు. అయితే వారు సెల్ఫీ తీసుకునేలోగానే వేగంగా వచ్చిన రైలు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనీష్ తీవ్ర గాయాలతో బయటపడగా, మిగిలిన ముగ్గురు చనిపోయారు.

More Telugu News