: వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ దే విజయం: టీ డిప్యూటీ సీఎం శ్రీహరి

వరంగల్ లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మోగించనుందని ఆ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ లోక్ సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన ఆయనను కేసీఆర్, తన మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో శ్రీహరి, వరంగల్ ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు. తన రాజీనామాతో జరగనున్న ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించి తీరుతుందని ఆయన ఓ ప్రైవేట్ తెలుగు న్యూస్ ఛానెల్ తో మాట్లడిన సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎంపీగా గెలిచిన తాను రాష్ట్ర మంత్రినవుతానని కలలో కూడా అనుకోలేదని కూడా శ్రీహరి అన్నారు.

More Telugu News