: 'విండోస్ 10'ను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్

కంప్యూటర్ నుంచి స్మార్ట్ ఫోన్ వరకూ అన్నింటిలో పనిచేసేలా 'విండోస్ 10' ఆపరేటింగ్ సిస్టంను మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. ఈ ఆపరేటింగ్ సిస్టం టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుందని సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సత్య నాదెళ్ల అంచనా వేశారు. డెస్క్‌ టాప్, ల్యాప్‌ టాప్, ట్యాబ్లెట్, స్మార్ట్‌ ఫోన్లలో అన్నింటిపై పనిచేసేలా ఈ టెక్నాలజీని డిజైన్ చేశామని ఆయన వివరించారు. కస్టమర్ల ప్రేమాభిమానాలు తమపై ఉన్నంతకాలం అత్యాధునిక సాంకేతికత అభివృద్ధిపై నిత్యం కృషి చేస్తామని తెలిపారు. దీంతోపాటు సంస్థ తొలిసారిగా 3డీ గాడ్జెట్ హాలోలెన్స్‌ ను మైక్రోసాఫ్ట్ ప్రదర్శించింది.

More Telugu News