కొండగా పెరుగుతూ పోయిన పుట్ట

సాధారణంగా పుట్టలు ఒక స్థాయి ఎత్తువరకు మాత్రమే పెరుగుతాయి. కానీ ప్రకాశం జిల్లా .. పెద్దారవీడు మండలం .. రాజంపల్లి గ్రామ సమీపంలో కొండగా పెరిగిన పుట్టను చూడవచ్చు. ఆ కొండపై వెలసిన వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవచ్చు .. ఆ స్వామి అనుగ్రహాన్ని అందుకోవచ్చు. పూర్వం ఈ ప్రదేశంలో ఒక పుట్ట ఉండేదట. కాలక్రమంలో ఆ పుట్ట ..  కొండగా పెరుగుతూ పోయిందని స్థానికులు చెబుతారు.

రాజమ్మ అనే ఒక భక్తురాలిని అనుగ్రహించడం కోసమే వేంకటేశ్వరస్వామివారు ఇక్కడ ఆవిర్భవించాడని అంటారు. ఆ రాజమ్మ పేరు మీదనే ఈ గ్రామానికి 'రాజంపల్లి' అనే పేరు వచ్చిందని చెబుతారు. గొడ్రాలుగా అనేక అవమానాలు ఎదుర్కున్న రాజమ్మ, స్వామి కరుణచేత సంతాన భాగ్యాన్నిపొందింది. అందువల్లనే ఈ కొండను 'గొడ్రాలికొండ' అని పిలుస్తారు. కొండ దిగువన రాజ్యలక్ష్మీ సమేతుడైన వేంకటేశ్వర స్వామి దర్శనమిస్తుంటాడు. ఈ మూర్తిని 'ముచికుంద మహర్షి' ప్రతిష్ఠించినట్టు చెబుతారు. సంతానం విషయంలో ఆలస్యమవుతున్నవారు, ఇక్కడి స్వామిని దర్శించుకుని ఆయన అనుగ్రహాన్ని పొందుతుంటారు.


More Bhakti News