ప్రత్యక్ష దర్శనమిచ్చే సుబ్రహ్మణ్యేశ్వరుడు

సుబ్రహ్మణ్యస్వామి కొలువైన మహిమాన్వితమైన క్షేత్రాల్లో 'నడిపూడి' ఒకటి. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఈ ప్రదేశానికి వచ్చి వెలిశాడని స్థలపురాణం చెబుతోంది. స్వామివారి గర్భాలయం లోపల వైపున ద్వారం పైభాగంలో 'పుట్ట' వుంది. ఈ పుట్టలో ఇప్పటికీ సర్పం ఉంటుంది.

ఈ సర్పం రాత్రివేళలో ఆ పుట్టలోకి ప్రవేశిస్తుంది .. ఉదయాన్నే బయటికి వెళ్లిపోతుంది. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చాలామంది వున్నారు. సుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై వున్నాడని స్థానికులు నమ్ముతుంటారు. సర్ప సంబంధమైన దోషాలతో బాధలుపడేవారు ఈ క్షేత్ర దర్శనం చేయడం వలన, ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదినాల్లో ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది.


More Bhakti News