ఆయురారోగ్యాలనిచ్చే శివలింగ ఆరాధన

పరమశివుడు కరుణా సాగరుడు .. అంకితభావంతో ఆ స్వామిని సేవించాలే గానీ, కరిగిపోయి వరాల వర్షం కురిపిస్తాడు. అలాంటి సదాశివుడు లింగరూపంలో కొలువై పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. లింగరూపంలోని దేవదేవుడిని దేవతలు .. మహర్షులు సైతం పూజించారు. వివిధ లోహాలతో .. రత్నాలతో తయారు చేసిన శివలింగాలను పూజించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని మహర్షులు సెలవిచ్చారు. ఒక్కో శివలింగాన్ని అభిషేకించడం వలన ఒక్కో ఫలితం లభిస్తుందనే విషయాన్ని స్పష్టం చేశారు.

సాధారణ మానవులంతా ఆదిదేవుడిని కోరుకునేది ఆయురారోగ్యాలే. భగవంతుడి సేవలో తరించాలన్నా కావలసింది ఆయురారోగ్యాలే. వజ్రంతో తయారుచేయబడిన శివలింగాన్ని పూజించడం వలన .. సీసంతో తయారుచేయబడిన శివలింగాన్ని ఆరాధించడం వలన ఆయురారోగ్యాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇక మనసులోని ధర్మబద్ధమైన ఏ కోరిక నెరవేరాలన్నా 'స్పటిక' శివలింగాన్ని పూజించవలసి ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చాటుతున్నాయి.       


More Bhakti News